Saturday, May 4, 2024

TS : రేప‌టి నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

ఈనెల 11 నుండి 21 వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమ‌వారం స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పాల్గొననున్నారు.

యాదగిరిగుట్టలో ఈ నెల 17న శ్రీ స్వామి వారి ఎదుర్కోలు.. 18న శ్రీ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం.. 19న శ్రీ స్వామి వారి దివ్య విమాన రథోత్సవాలను నిర్వహించనున్నారు. రూ. కోటి 60 లక్షల బడ్జెట్‌తో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభమై 25 వరకు కొనసాగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement