Thursday, May 2, 2024

ఆగస్టు 7న ఎస్‌సీటీ ఎస్సై పోస్టులకు రాత పరీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎస్‌సీటీ ఎస్సై పోస్టుల భర్తీకి రాత పరీక్షను ఆగస్టు 7న నిర్వహించిన తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఆగస్టు 7న ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొత్తం 554 ఖాళీల భర్తీకి ఈ వ్రాత పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రాత పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 503 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పింది.

హైదరాబాద్‌తో సహా 35 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 2, 47, 217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. జులై 30 నుంచి అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement