Thursday, May 9, 2024

తప్పిపోయిన వచ్చిన మహిళ.. సఖికేంద్రానికి తరలింపు

తప్పిపోయిన వచ్చిన మహిళను మహారాష్ట్ర సఖికేంద్రానికి తరలించారు. మార్చి 14న భూపాలపల్లి పోలీసులు రాత్రి 11 పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో రోడ్డుపై సరిత అనే మహిళ ఒంటరిగా కనిపించింది. ఆమెను ప్రశ్నించగా.. సరైన సమాదానం చెప్పలేదు. దీంతో భూపాలపల్లి పోలీసులు బాధిత మహిళను షెల్టర్ కోసం సఖి సెంటర్ కు తరలించారు. సఖి సిబ్బంది బాధిత మహిళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమె వివరాలు కనుగొన్నారు. సదరు మహిళ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎట్టపల్లికి చెందిన సరితగా గుర్తించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గడ్చిరోలి జిల్లా సఖి కేంద్రంలో బాధిత మహిళని అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement