Saturday, May 4, 2024

Women Reservation Bill – కవితకు అభినందన ల వెల్లువ..

హైద‌రాబాద్ – కేంద్రప్రభుత్వం చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడం ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరాట ఫలితమే అంటూ మహిళ లోకం కవితకు అభినందనలు తెలిపేందుకు హైధరబాద్ కు క్యూ కడుతున్నారు. బుధవారం కరీంనగర్ కు చెందిన బి ఆర్ ఎస్ నాయకురాలు రుద్ర రాధ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలసి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా రుద్ర రాధ మాట్లాడుతూ త‌క్ష‌ణ‌మే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అమ‌లు చేయాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లోనే ఆ బిల్లును అమలు చేయాల‌న్నారు. లేదంటే దానికి ఓ డెడ్‌లైన్ విధించాల‌ని కోరారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఈ విషయంలో కేంద్రానికి సూచనలు చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement