Sunday, April 28, 2024

Hyderabad: వింగ్స్ ఇండియా ప్ర‌ద‌ర్శ‌న‌…సందర్శకుల తాకిడి

హైదరాబాద్‌లోని నిర్వ‌హిస్తున్న బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా – 2024 ప్రదర్శనకు మూడో రోజు సందర్శకులను అనుమతించడంతో సందడి నెలకొంది. మొదటి 2 రోజులు పూర్తిగా వాణిజ్యపరంగా కార్యక్రమం నిర్వహించారు.

ఇవాళ, రేపు సందర్శకులను అనుమతిస్తున్నారు. ఇందుకోసం ‘బుక్మై షో’లో ముందుగా టికెట్లు కొనుగోలు చేసుకోవాలి. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి రూ.750గా నిర్ణయించారు. మూడేళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. అయితే, సందర్శకులు విమానాల్లోకి నేరుగా వెళ్లే వీల్లేదు. ప్రదర్శనలో ప్రతి విమానం పక్కన 30 అడుగుల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా సంస్థల ప్రతినిధులు దాని ప్రత్యేకతలు వివరిస్తున్నారు. కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా వినోదం కోసం శివమణి బృందంతో సంగీతోత్సవం ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement