Monday, April 29, 2024

ADB: విప్ బాల్క సుమన్ ప్రజా ఆశీర్వాద ర్యాలీ.. వెల్లువెత్తిన అభిమానులు

చెన్నూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీకి వేలాదిగా గులాబీ శ్రేణులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ కు మరోసారి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన బాల్క సుమన్ కు గులాబీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఇందారం క్రాస్ రోడ్ నుండి జైపూర్, భీమారం మీదుగా చెన్నూరు వరకు పదివేల బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తో పాటు పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement