Thursday, May 2, 2024

Kamareddy: గ్రూపు-2 పరీక్షలకు ఉచిత శిక్షణ: కలెక్టర్

కామారెడ్డి, ఆగస్టు 26 (ప్రభ న్యూస్) : గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణా రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 45రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బుద్దిస్ట్ లు, పార్శికులకు కామారెడ్డి పట్టణంలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.

ఆసక్తి గల జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 30లోగా తమ విద్యార్హతలతో పాటు కుల ధ్రువీకరణ పత్రాన్ని జతపరచి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని 2వ అంతస్తులో గల జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమాధికారి కార్యాలయం, రూమ్ నెంబర్ 222, నందు దరఖాస్తు సమర్పించాలని, వివరాలకు 73062 42629 ఫోన్ నెంబర్ కు సంప్రదించవలసినదిగా కలెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement