Sunday, May 5, 2024

బిజెపి టిఆర్ఎస్ ఘర్షణ… పోలీసుల లాఠిచార్జ్య్

మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నెల్లికుదురు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఈ ఘర్షణ జరిగింది. టిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా బిజెపి నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, జాటోత్ హుస్సేన్ నాయక్ పై టిఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. టిఆర్ఎస్ నాయకుల పై చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ నెల్లికుదురు, తొర్రూరు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement