Wednesday, May 15, 2024

స్పీక‌ర్ జీ…. ఎంపి బండిపై ఏం చ‌ర్య‌తీసుకోబోతున్నారు – కెటిఆర్ ట్విట్

హైద‌రాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీని అవమానించారన్న కారణంతో కాంగ్రెస్‌ ఎంపీపై చర్యలు తీసుకున్నారని.. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై అత్యంత నీచమైన భాషలో మాట్లాడిన బీజేపీ ఎంపీని ఏం చేయాలో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేశారు.

‘ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు కాంగ్రెస్‌ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ నిన్న లోక్‌ సభలో తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ఎన్నికైన పాపులర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అత్యంత నీచమైన భాషలో దూషించారు. ఇప్పుడు లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏం చేస్తారు..?’ అని ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement