Wednesday, May 8, 2024

TS | ఆదివాసుల అభివృద్ధికోసం కృషి చేస్తాం: పాల్వాయి హరీష్ బాబు

బెజ్జుర్ (ప్రభ న్యూస్) : మండల కేంద్రంలో ఈ రోజు ఆదివాసీ జే.ఏ.సి నాయకుల ఆధ్వర్యంలో నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అశువులు బాసిన ఆదివాసీ నాయకుడు కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ ఐటీడీఏ ఫలాలు గిరిజనులకు అందడం లేదని,ఐటీడీఏ ను ప్రక్షాళన చేసి గిరిజనులకు అండగా నిలిచేవిధంగా తయారు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

అలాగే పోడు భూముల సమస్య పరిష్కరించి గిరిజనులకు అండగా ఉంటామని, గిరిజనులకు హౌసింగ్ ,రోడ్లు, కరెంట్ సౌకర్యాలు కల్పించడంలో కృషి చేస్తామన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడి అశువులు బాసిన గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీం ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఇంఛార్జి చైర్మన్ కోనేరు కృష్ణ రావు, జెడ్పీటీసీ డోకే రోజా రమణి, సర్పంచ్ ఆన్సర్ హుస్సేన్, ఆదివాసీ నాయకులు సిడాం గణపతి, సోయం చిన్నయ్య, మెస్రం రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement