Tuesday, May 14, 2024

TS: తెలంగాణలో 10కిపైగా ఎంపీ సీట్లు సాధిస్తాం.. శివ‌రాజ్ సింగ్ చౌహాన్

తెలంగాణ రాష్ట్రంలో 10కిపైగా ఎంపీ సీట్లు సాధించబోతున్నామ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మాజీ సీఎం కరీంనగర్ కు విచ్చేశారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ లు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై శివరాజ్ సింగ్ చౌహాన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా చౌహాన్ మాట్లాడుతూ… కరీంనగర్ రావడం త‌నకు చాలా సంతోషంగా ఉందన్నారు. త‌న‌ కుటుంబ సభ్యులను కలిసినట్లుగా ఉందన్నారు.

దేశమంతా చర్చించుకునేలా చేసిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అని, బీజేపీ చరిత్రలో ఇంతవరకు రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన నాయకుడు ఎవరూ లేరని, బండి సంజయ్ ఒక్కరేన‌ని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బండి సంజయ్ ను బంపర్ మెజారిటీతో గెలిపించండని పిలుపునిచ్చారు. తెలంగాణలో తొలి విజయం కరీంనగర్ నుండే శ్రీకారం చుట్టాలన్నారు. బీఆర్ఎస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. జాతీయ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ ఎక్కడా లేకుండా పోయిందన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ ప్రజలంతా మామాజీ అని ఆప్యాయంగా పిలుచుకునే శివరాజ్ సింగ్ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో ఇంటింటికీ అయోధ్య రామయ్య పొటో ఫ్రేమ్ లు అందజేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement