Saturday, May 4, 2024

MBNR: నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా… ఎమ్మెల్యే మర్రి

నాగర్ కర్నూల్, జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 13, (ప్రభ న్యూస్): మీకు సేవ చేసే అదృష్టాన్ని ఇచ్చిన నాగర్ కర్నూల్ నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి నీరు, 24 గంటలు ఉచిత కరెంటు, ఎరువులు, వ్యవసాయానికి పెట్టుబడి ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు.

కుల వృత్తులను ప్రోత్సహిస్తూ అన్ని వసతులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని వెల్లడించారు. 20సంవత్సరాల క్రితం కేసీఆర్ లాంటి నాయకులు ఉంటే నాటి జనరేషన్ ఎంతో అభివృద్ధి చెందేదని తెలియజేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నీరు లేక, కరెంటు లేక తెలంగాణ ప్రజలు బ్రతుకు జీవుడా అని నరకం చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement