Friday, May 3, 2024

TS: కారును ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. మూడేళ్ల చిన్నారి మృతి

వాటర్ ట్యాంకర్ కారును ఢీకొన్న ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చోటు చేసుకుంది. కారును వాటర్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితులంతా పాతబస్తీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement