Thursday, May 9, 2024

కాంగ్రెస్‏తోనే సంక్షేమం సాధ్యం : దొంతి మాధవ రెడ్డి

కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలో సంక్షేమం సాధ్య‌మ‌ని, ప్రస్తుత ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌ని మాజీ శాసన సభ్యులు, ఏఐసిసి సభ్యులు దొంతి మాధవ రెడ్డి అన్నారు. బుధ‌వారం హాత్ సే హాత్ జూడో యాత్రలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో దొంతి మాధవ రెడ్డి తొలి విడతగా పాదయాత్రను దుగ్గొండి మండలంలో నుంచి ప్రారంభించారు. తొలుతగా కేశవాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించారు. అనంతరం కేశవాపురం లక్ష్మీపురం బంధం పల్లి మూడు గ్రామాలలో ప్రధాన వీధుల గుండా పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. గ‌తంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నాక బీఆర్ఎస్ రాష్ట్రంలో, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు చేసిన ఫెయిల్యూర్స్ ని, వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ పాదయాత్రను ముందుకు సాగడం జరిగింది. మధ్యాహ్నం లక్ష్మిపురం మధ్య మొక్కజొన్న చేను చెట్ల నీడన విడిదిలో ఉండడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement