Thursday, May 2, 2024

జాతీయ రహదారిపై ఉపాధి కూలీల రాస్తారోకో

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్న పెద్దనాగారం స్టేజి వద్ద ఉపాధి కూలీలు రాస్తారోకో నిర్వహించారు. పని చేసిన వారికి డబ్బులు తక్కువ వస్తున్నాయని, చేయని వారికి డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సరైన పనికి తగిన వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితులకు తగు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement