Friday, May 17, 2024

క‌న్న‌డ న‌టుడు – మోహ‌న్ జునేజా క‌న్నుమూత

కేజీఎఫ్‌2లో న‌టించిన ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు మోహ‌న్ జునేజా క‌న్నుమూశారు. కేజీఎఫ్ చిత్రంతో ఈయ‌న‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ‘గ్యాంగ్‌తో వ‌చ్చే వాడు గ్యాంగ్ స్టర్‌.. కానీ అత‌నొక్క‌డే వ‌స్తాడు, మాన్‌స్ట‌ర్’ అంటూ చెప్పిన డైలాగ్ ఈయ‌న‌కు తెలుగులో మంచి పాప్యులారిటీని తెచ్చిపెట్టింది.గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మోహ‌న్ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తెల్ల‌వారుజామున‌ తుది శ్వాస విడిచాడు. సిరీయ‌ల్ యాక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన‌ మోహ‌న్ అన‌తికాలంలోని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి న‌టుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈయ‌న దాదాపుగా 100కు పైగా సినిమాల‌లో న‌టించాడు. చివ‌ర‌గా ఈయ‌న కేజీఎఫ్ చాప్ట‌ర్‌-2 లో న‌టించాడు. మోహ‌న్ మ‌ర‌ణం ప‌ట్ల క‌న్న‌డ ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.మోహ‌న్ జునేజా క‌ర్ణాట‌కలోని తుమ్‌కూర్ జిల్లాలో జ‌న్మించాడు. ‘చెల్లాట’ సినిమాతో ఈయ‌న‌కు క‌న్న‌డ‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఒక విధంగా ఈయ‌న కెరీర్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంలో మోహ‌న్ కమెడీయ‌న్ పాత్ర‌లో న‌టించాడు. దీంతో పాటుగా ‘మ‌స్తీ’, ‘రామ్‌లీలా’,’బ‌చ్చ‌న్‌’, ‘కేజీఎఫ్’ వంటి సినిమాలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement