Monday, May 6, 2024

WGL: పాఠశాలలో పెచ్చులూడి పడి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు..

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఉన్న బొందబడి జిల్లా పరిషత్ మోడల్ పాఠశాలలో స్లాబ్ పెచ్చులూడి పడి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. స్లాబ్ పెచ్చులూడటంతో 7వ తరగతి చదువుతున్న పాకాల రోడ్డుకు చెందిన మహిదర్, సర్వపురం గ్రామానికి చెందిన అజయ్ గాయపడ్డారు. గమనించిన ఉపాధ్యాయులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ విషయంపై శాంత కుమారిని వివరణ కోరగా.. తాను బదిలీపై మాత్రమే వచ్చానని, ఇంకా ఛార్జ్ తీసుకోలేదన్నారు. ఇక్కడ విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన రమేష్ సెల్ఫ్ రిలీవ్ అయి వెళ్లినట్లు తెలిపారు. వారం రోజులు అవుతున్నా ఇంతవరకు విధుల్లో చేరకుండా ఉండటం వెనుక ఉన్న కారణం తెలియాల్సి ఉంది. నామమాత్రంగానే మన ఊరు మన బడి పనులు చేసినట్లు ఉందని శాంత కుమారి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement