Friday, May 17, 2024

నల్ల జెండాలతో నిరసన తెలిపిన టీఆర్ఎస్ శ్రేణులు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ లో తరహాలో తెలంగాణ వడ్లను కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. అలాగే, వంట గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని శుక్రవారం భూపాలపల్లి జిల్లాలో రైతులు, టిఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే  గండ్ర వెంకటరమణ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అదేశాలతో నైన్ పాక గ్రామంలో జడ్పీటీసీ గొర్రె సాగర్ ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement