Sunday, May 5, 2024

TS | ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ మృతి.. వరంగల్​ జిల్లాలో ఘటన

నెక్కొండ, (ప్రభ న్యూస్): పొలం దున్నుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా కొట్టి డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయిన ఘటన వరంగల్ జిల్లాలో ఇవ్వాల (గురువారం) జరిగింది. ఈ సంఘటన నెక్కొండ మండలంలోని మూడుతండా గ్రామంలో సాయంత్రం చోటుచేసుకుంది. నెక్కొండ ఎస్సై షేక్ జానీపాషా తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం మండలం తూర్పుతండాకు చెందిన రైతు జాటోతు రామన్(29) (డ్రైవర్) ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో రామన్ కు బలమైన గాయాలు తగిలాయి. సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలు గమనించి బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య దివ్య, ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement