Sunday, April 28, 2024

TS : కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్ట‌ర్… ఒక‌రు మృతి…

మంగపేట, మార్చి 20 (ప్రభ న్యూస్): అదుపు త‌ప్పి ట్రాక్ట‌ర్ కాలువ‌లోకి దూసుకెళ్లింది. ఈప్ర‌మాదంలో డ్రైవ‌ర్ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. మంగపేట మండలం జబ్బోనిగూడెం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో మండల కేంద్రంలోని పొద్మూరుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఎండీ.యాకూబ్ పాషా (40) మృతి చెందాడు.

- Advertisement -

మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామంలో పట్టా భూములలో ఇసుక తరలించేందుకు ( ఇసుక క్వారీ ) రోడ్డు కోసం భిక్షంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని జబ్బోనిగూడెం సమీపంలోని ఓ రైతు భూమిలో నుండి మట్టి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పడంతో జబ్బోనిగూడెం సమీపంలో నర్సింహ సాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ఎండీ.యాకూబ్ పాషా ట్రాక్టర్ క్రింద ఇరుక్కుపోయి సంఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్సై గోదరి రవి కుమార్ తమ సిబ్బందితో సంఘటనాస్థలంకు చేరుకుని ట్రాక్టర్ క్రింద ఉన్న మృతదేహాన్ని స్థానికుల సహకారంతో బయటకు తీశారు. మృత దేహాన్ని బయటకు తీయడంలో మంగపేట ఎస్సై గోదరి రవి కుమార్ వ్యవహరించిన తీరు అభినందనీయం. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మంగపేట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం యాకూబ్ పాషా మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య రేష్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement