Monday, April 29, 2024

TS: ఎంపీ ఎన్నికల్లో ఉద్యమకారులకే టికెట్ ఇవ్వాలి..

వడ్డేపల్లి.. (వరంగల్) : రాబోయే లోకసభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమకారులకే టికెట్ కేటాయించాలని మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీలో, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించామని గుర్తు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో హరిత కాకతీయ హోటల్ ప్రారంభోత్సవంలోమాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిపై కోడిగుడ్ల దాడిలో మాపై రౌడీషీట్ నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు పార్టీ అధికారంలో ఉండి, ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో సొంత ప్రయోజనాల కోసం ఇతర పార్టీలో చేరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంపీగా తమకు అధిష్టానం అవకాశం ఇస్తే రాజకీయాలకు అతీతంగా ప్రజలు మమ్ములను భారీ మెజారిటీతో గెలిపిస్తారని సృష్టం చేశారు. పార్టీలో సభ్యత్వం లేని వారికి ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పునరాలోచించి ఉద్యమకారులకే టికెట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జోరిక రమేష్, బోడ డిన్న, వీరేందర్, రజనీకాంత్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement