Wednesday, May 1, 2024

గోవర్దనగిరిలో ఘోర రోడ్డుప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

రఘునాథపల్లి, ప్రభన్యూస్‌: బంధువుల ఇంట్లో వివాహ వేడుకలకు వెళ్తూ ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందిగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్దనగిరి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గోవర్దనగిరి గ్రామంలోని జాతీయ రహదారిపై దర్గా సమీపంలో టవేరా వాహనం టైరు పేలడలడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షతగాత్రులను 108వాహనం ద్వారా జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలపడంతో బంధువులు మెరుగైన వైద్యం కోసం హన్మకొండ ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్లితే వరంగల్‌ చింతల్‌ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన పది మంది టవేరా వాహనంలో హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో వివాహ వేడుకలకు వెళ్తున్న క్రమంలో గోవర్దనగిరి దర్గా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆఫ్రిన్‌బేగం(50), ఫర్జాద్‌బేగం(52), షౌకత్‌ హుస్సెన్‌(56) అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలపాలైన వారిలో రహీనాబేగం, గౌసియాబేగం, హైమత్‌ అలీ, రోషన్‌, హాకీం, రమేజ మహిద్‌, మక్బూల్‌లకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఐపీఎస్‌ పరితోష్‌ పంకజ్‌, సిఐ వినయ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని 108 ద్వారా జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు బంధువులు వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement