Monday, May 6, 2024

సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది : మంత్రి ఎర్ర‌బెల్లి

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని పెద్ద వంగర మండలం ఉప్పర గూడెంలోని రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా ధ్వజ స్తంభం ప్రతిష్ఠించారు. మంత్రి ధ్వజ స్తంభానికి నవగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం మంత్రికి పూజారులు శాలువాతో సత్కరించి, ఆశీర్వచనం అందించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఉప్పర గూడెం దేవాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆ దేవుడి కృపా కటాక్షాలు అందరిపైనా ఉండాలని కోరుకున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, భవిష్యత్తులో సీఎం నాయకత్వంలో తెలంగాణ బంగారు మయం కావాలని కోరుకున్నారు. కేసీఆర్ కుటుంబం చల్లగా ఉండాలని మంత్రి కోరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement