Sunday, April 28, 2024

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.. కేసు నమోదు

టేకుమట్ల, ఏప్రిల్ 10 (ప్రభ న్యూస్) : ప్ర‌భుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం టేకుమట్ల పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మిళ్లపల్లి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన పట్టెం శంకర్ ఓనర్, డ్రైవర్ నాగరాజు, కోటిలింగం ఓనర్, డ్రైవర్ కలికోటపల్లి మానేరు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుకను తరలిస్తున్న క్రమంలో రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు. ట్రాక్టర్లకు కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేదని, ఇలాంటి అక్రమ ఇసుక దందాకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై చల్ల రాజు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement