Monday, May 6, 2024

నల్ల బెల్లం, పటిక పట్టివేత.. ద్విచక్ర వాహనం సీజ్..

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని రాజనపల్లి పరిస ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై నల్ల బెల్లం, పట్టిక తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి పట్టుకోవడం జరిగిందని గూడూరు ఎస్ఐ సతీష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు మండలం లోని దామరవంచ ఉమ్మడి గ్రామపంచాయతీ లోని చక్ర తండా గ్రామానికి చెందిన భూక్య శ్రీను అక్రమంగా తరలిస్తున్నాడని పేర్కొన్నారు. వారిని పట్టుకొని ద్విచక్ర వాహనం సీజ్ చేసి వారి పైన కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ బిచ్చ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement