Thursday, May 2, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం.

భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం మొరంచపల్లి వద్ద పరకాల-భూపాలపల్లి 353 జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇనోవా వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న గ్రామపంచాయతీ వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయింది. హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామం నుంచి రామగుండం పెళ్లికి ఇన్నోవా వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో 11 మంది ఉండగా 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు. కాగా పెళ్లి కుమారుని వాహనం ముందే వెళ్ళింది. ఈ వాహనం వెనుకాల మరో బస్సు ఇన్నోవా వాహనం కూడా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement