Sunday, April 28, 2024

TS : వ‌రంగ‌ల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం… ఇద్ద‌రు మృతి…

వ‌రంగ‌ల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. వడ్డేపల్లి క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

- Advertisement -

వివరాలలోకి వెళితే…. కాజీపేట నుంచి హనుమకొండ వైపు బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు రెవెన్యూ కాలనీ నుండి వడ్డేపల్లి వైపు వెళుతున్న కారును ఢీకొని కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాజీపేటకు చెందిన సయ్యద్ వహీద్, అశ్రఫ్ గా గుర్తించారు. ఇద్దరూ కాజీపేట నుంచి హనుమకొండ వైపు వస్తుండగా రెవెన్యూ కాలనీ నుంచి వడ్డేపల్లి వైపు వెళ్తున్న కారును ఢీకొoది. ఈ ఘటనపై సుబేదారి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement