Monday, April 29, 2024

ట్రాక్టర్ బోల్తా ..తప్పిన ప్రమాదం

మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ములకలపల్లి కొరికిశాల గ్రామాల మధ్య గురువారం ట్రాక్టర్ బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోతుగల్లు గ్రామానికి చెందిన రైతు పరమేష్ మొగుళ్లపల్లి మండల కేంద్రానికి ఏఈఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఆయిల్ ఫామ్ నుండి మొక్కలను తేవడానికి వెళ్లి… ట్రాక్టర్ లో 500 మొక్కలు వేసుకొని తిరిగి గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు ధ్వంసం కావడంతో ఈ ప్రమాదం జరిగిందని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement