Monday, May 6, 2024

ఘనంగా బాలల దినోత్సవం

మండ‌లంలోని సోమ‌ర‌పుకుంట తండాలోని ప‌ల్లె ప్ర‌కృతి వ‌నంలో శ‌నివారం బాల‌ల దినోత్స‌వాన్ని అంగన్వాడి టీచర్లు వినూత్నంగా నిర్వ‌హించారు. నెహ్రూ చిత్రప‌టానికి పూళ‌మాల‌లు వెసి నివాళుల‌ర్పించారు. అదేవిధంగా టిక్యా తండా పాఠశాలలో చిన్నారులు స్థానిక నాయకులతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రకృతి వనం లో చిన్నారులకు పలు అంశాల్లో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు జాటోత్ స్వామి నాయక్, టిక్యా తండా ఉపసర్పంచ్ జాటోత్ వెంకన్న,తెరాస గ్రామ అధ్యక్షుడు జగన్ నాయక్, అంగన్వాడి టీచర్లు చంద్రకళ, సీత, ఉషారాణి,ఆయాలు శారదా, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement