Wednesday, April 24, 2024

రూ.505కే హైద‌రాబాద్ న‌గ‌రాన్ని చుట్టేయొచ్చు..ఎలాగో తెలుసా..

హైద‌రాబాద్ మొత్తం చూడాలంటే ఒక‌రోజు అయ్యే ప‌నేకాదు..దానికి తోడు ఖ‌ర్చు కూడా భారీగానే అవుతుంది. అయితే ఐఆర్ సీటీసీ 505రూపాయ‌ల‌కే సిటీ మొత్తాన్ని చూపించ‌నుంద‌ట ఐఆర్‌సీటీసీ హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ వచ్చింది. ఇక ఎంత డబ్బులు అవుతాయి అనేది చూస్తే… నలుగురు నుండి ఆరుగురు అయితే రూ.1170 పడుతుంది. అదే ఏడు నుండి పన్నెండు మంది గ్రూప్ బుకింగ్ ఆప్షన్ అయితే ఒక్కొక్కరికి రూ.1145 అవుతుంది. అదే పదమూడు నుండి ఇరవై రెండు మంది గ్రూప్ బుకింగ్‌ ఆప్షన్‌కు అయితే రూ.505 చెల్లించాలి.. పైగా ఇది ఒక్క రోజు టూర్ మాత్రమే. సికింద్రాబాద్/ నాంపల్లి/ కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ఈ టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. టూర్ ప్రతి రోజూ ఉంటుంది. టూర్‌లో భాగంగా ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, సలార్‌జంగ్ మ్యూజియం, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌సాహి సమాధులు, చౌమొహల్లా ప్యాలెస్ వంటివి చూడొచ్చు. సోమవారం, శుక్రవారం మాత్రం ఉండదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement