Monday, April 29, 2024

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి : మంత్రి ఎర్ర‌బెల్లి

గురుకుల పాఠ‌శాలల్లో విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాల‌ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఇదే పాఠశాలలో ఇటీవల ఆహారం వికటించి, పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.. ఈ విషమై మంత్రి ఎర్ర‌బెల్లి సంబంధిత అధికారులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రతను పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా లేవని హాస్టల్ వార్డెన్ పై ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement