Thursday, May 2, 2024

WGL: ప్రజా బలగమే..నా బలం.. గండ్ర వెంకట రమణారెడ్డి

మొగుల్లపల్లి, నవంబర్ 8 (ప్రభ న్యూస్): ప్రజాబలగమే నా బలమని, మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే ఊహించలేనంత అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ జిల్లా మండలంలోని ములకలపల్లి, పిడిసిల్ల, ఎల్లారెడ్డిపల్లి, గుండ్ల కర్తి, కాసులపాడు, మోట్లపల్లి, మెట్టుపల్లి, గుడిపాడు, గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు మంగళారతులతో బ్రహ్మరథం పట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మొగులపల్లి మండలంలోని ప్రతి గ్రామాన్ని కన్నతల్లిలా భావించి, అభివృద్ధికి కృషి చేశానన్నారు. గ్రామంలో ఏ వీధి చూసిన అభివృద్ధి కనబడుతుందన్నారు.

మీకు సేవ చేయాలనే లక్ష్యంతో మూడోసారి మీ ముందుకు వచ్చానన్నారు. ఆలోచన లేని అభివృద్ధి అంటే తెలియని స్వార్థపూరిత రాజకీయాలతో మీ ముందుకు వస్తున్న ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు. అభివృద్ధిని నిర్వీర్యం చేయడం కోసమే కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి, కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ జోరుగా సదయ్య, ఎంపీపీ యర సుజాత సంజీవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు, సర్పంచులు అన్నారెడ్డి, నైనకంటి ప్రభాకర్ రెడ్డి, పెంతల రాజేందర్ రెడ్డి, గుంటి లక్ష్మి, ఏకాంబ సుగుణ రావు, నరహరి పద్మ వెంకటరెడ్డి, పాశం స్వరూప పర్వతాలు, దానబోయిన రాములు, మొగులపల్లి సర్పంచ్ మోట ధర్మారావు, నరసింహారెడ్డి, దేవనూర్ కుమార్, చెక్క శ్రీధర్, బాబురావు లతో పాటు నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement