Friday, May 3, 2024

పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు..

ములుగు జిల్లా.. పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేసిన ములుగు ఏ ఎస్ పి శ్రీ పోతరాజు.. సాయి చైతన్య ఐపిఎస్
ములుగు ఏ ఎస్ పి కార్యాలయ ఆవరణలో ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బందికి హెల్మెట్స్ ని తిరుమల టీవీఎస్ షోరూం యజమాని శ్రీ గున్నాల తిరుమల్ రెడ్డి సౌజన్యంతో ములుగు ఏ ఎస్ పి శ్రీ సాయి చైతన్య ఐపిఎస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది తప్పకుండా రోడ్డు నియమనిబంధనలు పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. హెల్మెట్ లేకుండా పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ పంపిణీ చేసిన టీవీఎస్ షోరూం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement