Thursday, May 2, 2024

పంచాయతీ కేంద్రంగా మున్సిపాలిటీ… నిబంధనలు గాలికేనా..!

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయ స్థలం పంచాయతీలకు కేంద్రంగా తయారైంది. వద్దని చెప్పాల్సిన పాలక వర్గామే కుర్చీలు వేసుకుని మరీ పంచాయతీలు చేస్తోందంటే మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో కమిషనర్, చైర్మన్ సైతం కార్యాలయంలో ఉండటం గమనార్హం. మున్సిపాలిటీలో పంచాయతీలు చేయటం చట్ట రీత్యా నిషిద్ధం అని నోటీస్ బోర్డులు కమిషనర్ పేరిట ఏర్పాటు చేశారు. అయితే ఆ నిబంధనలకు పాలక వర్గ సభ్యులే తూట్లు పొడుస్తున్నారు. ఈ ఘటన పై కమిషనర్ ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement