Friday, April 26, 2024

కంతి ఉందని పసిపాపను వదిలేసి వెళ్లిన తల్లి..?

రఘునాథపల్లి : మాతృత్వం మంటగలిసింది..! కన్న పేగు భారమైంది! దీంతో బంధం తెంచుకుంది ఓ తల్లి. పుట్టి నాలుగు రోజులు కూడా కానీ ఓ చిన్నారిని ఆదివారం తెల్లవారుజామున రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఫాతిమా చికెన్ సెంటర్ సమీపంలో వదిలేసి వెళ్లిన అమానవీయ ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున ముక్కు పచ్చలారని నాలుగు రోజుల చిన్నారిని మండల కేంద్రంలో వదిలేసి వెళ్లారు. తెల్లవారుజామున స్థానికులు పసిపాపను గమనించి అంగన్వాడీ కార్యకర్తలకు సమాచారం అందించారు. దీంతో స్థానిక ఆశా వర్కర్లు కవిత, శ్రీలతలు అక్కడకు చేరుకుని ఆచిన్నారిని అక్కున చేర్చుకున్నారు. విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి ఆదేశాల మేరకు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆపాప బాధ్యతలు చేపట్టారు. అయితే ఈపాపకు తలపై పెద్ద కంతి ఉండడంతో వదిలేసి వెళ్లినట్లు తెలుస్తుంది. కంతి ఉండడం వల్లనే ఆపాపను వదిలేశారా? అధిక సంతానం కారణంగా వదిలేశారా అనే విషయం తెలియదు. ఏది ఏమైనా ఈఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement