Thursday, April 25, 2024

మంత్రి ఇంట్లో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య… ప్రేమ వ్యవహారమే కారణం!

నిజమాబాద్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దేవేందర్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మ‌హత్యకు పాల్పడడం కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా మంత్రి ఇంట్లో పనిచేస్తున్న దేవేందర్ కు ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అర్ధరాత్రి వరకు ఫోన్ లో చాటింగ్ చేసిన తర్వాత ఉరి వేసుకునట్లు తెలుస్తోంది. మంత్రి ఇంటి వద్దకు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి ప్రభాకర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement