Friday, May 17, 2024

టిఆర్ఎస్ అంటే భరోసా, భద్రత: ఎమ్మెల్యే పెద్ది

టిఆర్ఎస్ అంటే సుస్థిర పాలన అని నర్సంపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వల్లపుదాసు రమేష్ అనే కార్యకర్త ప్రమాదవశాత్తు మరణించగా పార్టీ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును అతని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ ముందు చూపుతో కార్యకర్తల కోసం ప్రమాద బీమాను అమలు చేస్తున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పించారని అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి కోసం రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించడంలో టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement