Monday, May 6, 2024

Breaking : సాలూరు ఎమ్మెల్యే రాజ‌న్న దొర‌కు అస్వ‌స్థ‌త‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని సాలూరు ఎమ్మెల్యే రాజ‌న్న దొర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పార్వతీపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అస్వస్థతకు గురయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రారంభం సందర్భంగా సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాజన్నదొర పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడడంతో వీడియో కాన్ఫరెన్స్‌ నుంచి మధ్యలో వెళ్లిపోయారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే రాజన్నదొరకు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement