Monday, April 29, 2024

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

గత రెండేళ్లు కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందులు పడ్డాం..ఇప్పుడిప్పుడే కరోనా దూరమై అందరూ ఆరోగ్యంగా ఉన్నారని భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. మంగళవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని 3 వార్డు పరిధిలోని బాంబులగడ్డ వద్ద ఈద్గాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా రంజాన్ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నియామ నిష్ఠలతో ఉపవాస దీక్షలు చేపట్టి రంజాన్ మాసం నేటి చివరి రోజు ముగుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఈద్గాలో ఏర్పాటు చేసిన రంజాన్ పండుగ వేడుకలో పాల్గొన్నడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల  అభివృద్ధి కొరకు మైనార్టీ స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ అల్లా దయతో మీరు కోరుకున్న విధంగా కోరికలు తీర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ..ముస్లిం సోదరి సోదరులకు హృదయ పూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement