Saturday, April 27, 2024

లారీ, బైక్ ఢీ.. ఔదార్యాన్ని చాటుకున్న చిట్యాల సీఐ..

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి శివారు మొరంచపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం బూడిద లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చెల్పూర్ దుబ్బపల్లి గ్రామానికి చెందిన ఉడత బిక్షపతి (50) అనే సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న చిట్యాల సీఐ వేణు చందర్ గమనించి క్షతగాత్రున్ని వాహనంలో భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. కాగా ప్రమాదానికి కారణమైన బూడిద లారిని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement