Saturday, April 27, 2024

గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ‘కంటి వెలుగు’

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జ‌ర్న‌లిస్టుల కొర‌కు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ప్ర‌తి ఒక్క‌రూ కంటి వెలుగును స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్య‌క్షత వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ డీఎంహెచ్ఒ మదన్ మోహన్, ఐఅండ్ పీఆర్ ఏడి లక్ష్మణ్ కుమార్, కార్పరేటర్ కోమల కిషన్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి బొల్లారపు సదయ్య, టీయూడబ్ల్యూజేే జిల్లా కార్యదర్శి తోట సుధాకర్, రాష్ట్ర నాయకులు గడ్డం కేశవమూర్తి, కొండల్ రావు, గాడిపెల్లి మధు, వల్లాల వెంకటరమణ, పిన్నా శివకుమార్, బి. దయాసాగర్, ఎం. సుధాకర్, ఎన్. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement