Thursday, May 2, 2024

హిందూ సంస్థల ప్రతినిధుల ముందస్తు అరెస్ట్

జనగామ జిల్లా కేంద్రంలో పలు హిందూ సంస్థల ప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారు జామునే పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వ కుండా అరెస్ట్ చేయడం తో వారు ఆందోళన చెందారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భజరంగ్ దల్ , విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో లవ్ జిహాద్, భైంసా ఘటన కి నిరసనగా డీజీపీ ఆఫీస్ ముట్టడికి పిలుపు ఇవ్వ లేదని, శాసన సభ ముట్టడి కూడా పిలుపు ఇవ్వ లేదని వారు తెలిపారు.పోలీసులకు తప్పుడు సమాచారం రావడంతో తమను రాత్రికి రాత్రే జనగామ పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేశారని అన్నారు. పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసిన వారిలో జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తూరు వాసు,మంచాల రవీందర్,జైన రమేష్ గునిగంటి రామకృష్ణ, బుస్సా కేదారి,అల్వాల్ రవి, వల్లాల మధు,తిప్పరపు ఉమేష్,చింతకింది సంతోష్,లక్ష్మి గణపతి , దొంతుల శేఖర్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement