Friday, May 17, 2024

మేడారంలో హెలి రైడ్

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలి రైడ్ ను ఏర్పాటు చేస్తున్నది. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేడారం జాతరకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి యం.శివాజీ తెలిపారు. బెంగుళూరుకు చెందిన తుంబి ఎవియేషన్ సంస్థ హెలికాప్టర్ ను ఆదివారం నుండి అందుబాటులో వుంచుతుంది.

హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి మేడారం వరకు ప్రయాణానికి గాను( up and down) ఒక్కొక్కరికి రూ.19,999లు గా ఛార్జ్ చేస్తారు. మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి రూ.3700 ఛార్జ్ చేస్తారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ములుగు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. హెలి రైడ్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 9400399999, 9880505905 ఫోన్ లో లేదా [email protected] ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement