Saturday, May 18, 2024

భారీ వ‌ర్షాలు.. కోతకు గురైన రోడ్లు..

నిన్న కురిసిన భారీ వ‌ర్షాల‌కు రోడ్లు ధ్వంస‌మ‌య్యాయి. వ‌ర‌ద తాకిడికి ర‌హ‌దారులు కొట్టుకుపోవ‌డంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ములుగు జిల్లా పస్ర తాడ్వాయి మధ్య‌లో ఉన్న జలగలంచ బ్రిడ్జి పూర్తిగా కోట్టుకుపోయింది. దీంతో 163వ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా పస్ర మేడారం వేళ్ళే బాంబుల మేరి రహదారి పై వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement