Monday, April 29, 2024

డిగ్రీ కాలేజ్ విద్యార్థుల మధ్య ఫైటింగ్

ఓ ప్రముఖ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కు చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం, రెండవ .. మూడవ సంవత్సరంకి చెందిన విద్యార్థుల మధ్య ఫైట్ జరిగినట్లు సమాచారం.వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫంక్షన్ హల్ లో ఓ వేడుక జరుగుతున్న క్రమంలో బయట పలువురు విద్యార్థుల మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. అది గమనించిన సదరు కాలేజ్ అధ్యాపకులు వారిని వారించే ప్రయత్నం చేయగా.. మత్తులో ఉన్న విద్యార్థులు.. ఉపాధ్యాయులకు ఎదురు తిరిగారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను చెదరగొట్టారు. ఈ విషయం పై సదరు కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా తెలియదు అని వివరించారు. ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement