Thursday, May 2, 2024

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి. శ్రీనివాస్ కలిశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పదోన్నతిపై వరంగల్ జిల్లా నుండి భూపాలపల్లి, ములుగు జిల్లాకు నియమింపబడిన వి. శ్రీనివాస్ ఈ నెల 4న భూపాలపల్లిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బుధవారం నుండి ప్రారంభం కానున్న పుష్కరాల్లో ఎక్సైజ్ శాఖ సమర్థవంతంగా నిర్వర్తించాలని, అక్రమ మద్య నియంత్రణకై పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement