వాజేడు, (ప్రభ న్యూస్): సుదీర్ఘ ప్రాంతాల నుంచి ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న జలపాతములు, అటవీ అందాలను చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చే వారికి పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సంతోషంగా ఉన్న సమయంలో అవాంతరాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తపడాలని సూచించారు. బొగత జలపాతాలను చూసేందుకు వచ్చే మూడు రాష్ట్రాల ప్రజలకు వాజేడు ఎస్సై రేఖ అశోక్ హెచ్చరిక జారీ చేశారు.
పోలీసు, అటవీశాఖ సిబ్బందితో పాటు స్థానికులకు టూరిస్టులు సహకరించాలని కోరారు. జలపాతం దగ్గర నాట్ అలౌడ్.. డేంజర్ బోర్డులను దాటి లోతట్టు నీటి ప్రాంతానికి వెళ్లవద్దని, కోరి ప్రమాదలకు గురికావద్దని తెలిపారు. నీట మునిగి ప్రమాదం బారిన పడొద్దని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దని, చెట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.