Friday, May 3, 2024

కేసీఆర్ విజ‌న్‌తో రాష్ట్రంలో అభివృద్ది సుస్థిరం : డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్

మ‌రిపెడ : తెలంగాణ జాతిపిత కేసీఆర్ విజన్ తో రాష్ట్రంలో అభివృద్ది సుస్థిర‌మైంద‌ని డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ అన్నారు. గురువారం ఆయ‌న మ‌రిపెడ మండ‌లంలోని తానంచ‌ర్ల గ్రామంలో 5వ విడ‌త ప‌ల్లే ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామ పంచాయ‌తీ నిధుల‌తో స‌ర్పంచ్ దిగ‌జ‌ర్ల శ్వేత ముఖేష్ ఆధ్వ‌ర్యంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగ‌ణ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మెన్ గుడిపూడి న‌వీన్ రావుతో క‌లిసి ప్రారంభించారు. అనంత‌ర కాసేపు గ్రామ యువ‌త‌తో క‌లిసి వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూలీ.. ఉపాధి లేక.. వ్య‌వసాయం వ్య‌య‌సాయంగా మారి ప‌ల్లెలు ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స పెట్టిన రోజుల నుంచి… ప‌ల్లెలు ప‌చ్చ‌ద‌నంతో, ప‌సిడి ధాన్యం రాశుల‌తో.. జ‌ల క‌ళ‌ల‌తో మురిసె రోజును సాధించుకున్న దినం జూన్ 2 అన్నారు. 60 ఏళ్ల పోరాటం, నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష తీరిన రోజన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement