Thursday, April 25, 2024

Crime News : కొడుకులు, కోడ‌లితో క‌లిసి భ‌ర్త‌ను చంపిన‌ భార్య‌..

మొగుల్లపల్లి (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యుల చేతిలో రాములు అనే వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. చేనేత కార్మికుడైన రాములు భీమండిలో వృత్తి రీత్యా వలస వెళ్లాడు. గత కొన్ని నెలల క్రితం సొంత ఊరైన పర్లపెల్లి గ్రామంలో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. మృతుడికి భార్య ,ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె, కోడలు ఉన్నారు. ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు మూగవాడు కాగా భార్య పరకాలలో కాంగన్ హాల్ షాపు పెట్టుకొని జీవిస్తూ ఉంది. గత కొద్ది రోజుల నుండి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఇరువురు ఫిర్యాదు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

రాములను భార్య, ఇద్దరు కొడుకులు, కోడలు కలిసి ఆదివారం అర్ధరాత్రి రోకలిబండ, పగిలినగాజు గ్లాస్ తో గాయపరచగా మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తలకింద మెడ భాగంలో గాయమైనట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని చిట్యాల సీఐ పులి వెంకట్ గౌడ్ చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మొగలపల్లి ఎస్సై శ్రీధర్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రామును అన్యాయంగా పొట్టన పెట్టుకున్న భార్య, ఇద్దరు కొడుకులు, కోడలును కఠినంగా శిక్షించాలని పర్లపల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మృతుని ఇంటి వద్ద గుమికూడారు. పర్లపల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి చిట్యాల సీఐ మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉందని ప్రజల సహకరించినట్లయితే కేసు నమోదు చేసి నిందితులకు కఠినంగా శిక్ష పడే విధంగా పోలీసులు ప్రయత్నిస్తారని ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా సంయమనం పాటించాలని సీఐ పులి వెంకట్ ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement