Friday, May 3, 2024

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే వికేంద్రీకరణ.. అచ్చెన్నాయుడు

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే వికేంద్రీకరణ అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాప్ అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజీనామాల పేరుతో డ్రామా చేస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామనప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. మూడు రాజధానులు కావాలని ఎవరూ అడగడం లేదన్నారు. డెవలప్ మెంట్ కావాలని అడుగుతున్నారన్నారు. తనను రాజీనామా చేయాలనే అధికారం ఎవరికీ లేదని, అమరావతి రాజధాని అని ఎన్నికల్లో గెలిచానన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అమరావతి రాజధానే తమ నినాదమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement